రైతులను ఆగం చేసిన అకాల వర్షం
ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో మార్కెట్ యార్డు, కల్లాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దైంది. భారీ వర్షం రావడంతో వరదలకు పలు చోట్ల వరి ధాన్యం కొట్టుకుపోయాయి. సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులకు మామిడి పండ్లు నేలరాలాయి. ఈ వర్షాలు రైతులకు కన్నీళ్లను ముగిలిచాయి. పంటను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతున్నారు.