ధాన్యం తడవకుండ జాగ్రత్తలు పాటించాలి
మెదక్ , వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న మూడు రోజుల పాటు ఆకాల వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో రైతులు ధాన్యం రాసులు తడవకుండా భద్రపరచాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు టార్ఫాలియన్స్ తో కప్పి ఉంచాలన్నారు. ఈ సందర్భంగా పీపీసీ కేంద్రాల ఇన్ఛార్జ్లకు, రైతులకు ధాన్యం తడవకుండా చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.