తల్లిని చంపిన తనయుడు

7774చూసినవారు
తల్లిని చంపిన తనయుడు
మంగళవారం ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం కేంద్రంలోని తల్లపాడులో కన్నకొడుకు తల్లిని చంపాడు. గొర్రె సుశీల(50) అనే మహిళను ఆమె కొడుకు వేణు తాగిన మైకంలో హత్య చేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ములుగు సీఐ కొత్త దేవెందర్‌రెడ్డి శవానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమత్తం గొర్రె సుశీల మృతదేహాన్ని తరలించారు. పోలీసులు ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :