టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌

60చూసినవారు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌
IPL-2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని.. ఈరోజు వాంఖడేలో పరుగుల వరద పారనుందని ఇయాన్ మోర్గాన్, నిక్ నైట్ తెలిపారు.