కెనడాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్లోని లుథియానాకు చెందిన యువరాజ్ గోయల్(28) 2019లో కెనడా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల కెనడాలో శాశ్వత నివాస హోదా లభించింది. ఈ క్రమంలో శుక్రవారం బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగాయి. పోలీసులు అక్కడికి చేరుకొని యువరాజ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.