అమిత్ షాపై కాంగ్రెస్ MP అభ్యర్థి చామల విమర్శలు

75చూసినవారు
కేంద్రమంత్రి అమిత్ షా ఈరోజు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ స్పందించారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసి రూ.9 లక్షల కోట్లు అప్పు చేస్తే దొంగతనం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా చూసిందని విమర్శించారు. ఈ రోజు వచ్చి ఏం అభివృద్ధి చేసామో.. రానున్న 5 సంవత్సరాలు ఏం చేస్తామో చెప్తే బాగుండేదదని అభిప్రాయపడ్డారు. కేవలం కులమతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి.. మళ్ళీ BC, SC, ST లను దగ్గరకు చేర్చుకుందామని చెప్పి అమిత్ షా మాట్లాడినటువంటి విధానం అసలు అర్ధం కానీ విధంగా ఉందని విమర్శించారు.

ట్యాగ్స్ :