అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

80చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలో ఉన్న దుబ్బాక గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు రామన్నపేట ఎస్సై తెలిపారు. చౌటుప్పల్ డివిజన్ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు దుబ్బాక గ్రామ శివారులో తనిఖీలు చేయగా TS 08UG 6710 నెంబరు గల వాహనంలో 32 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్