మాజీ సీఎంపై ECకి NCPCR ఫిర్యాదు

85చూసినవారు
మాజీ సీఎంపై ECకి NCPCR ఫిర్యాదు
జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీపై ఎన్నికల సంఘం (EC)కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) శుక్రవారం ఫిర్యాదు చేసింది. రాజౌరి-అనంతనాగ్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాఠశాలకు వెళ్లే పిల్లలను ఉపయోగించుకున్నారని NCPCR పేర్కొంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ముఫ్తీపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని NCPCR అభ్యర్థించింది.