రైతులలో భరోసా పెంచాలి

79చూసినవారు
రైతులలో భరోసా పెంచాలి
వ్యవసాయ రంగం ద్వారా మేలు జరుగుతుందని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పించాలని తెలంగాణ రైతు సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కొండగొర్ల లింగన్న డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం జన్నారంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంపై పాలకులు అనుసరిస్తున్న విధానాలు రైతులను వ్యవసాయ రంగానికి దూరం చేస్తున్నాయన్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయని ఆయన వాపోయారు.
Job Suitcase

Jobs near you