చినుకు రాలదు చింత తీరదు

57చూసినవారు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై 17 రోజులు కావస్తున్న పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు కాలేదు. తొలకరి జల్లులను నమ్ముకుని పలు మండలాల్లో రైతులు వివిధ పంటల విత్తనాలు వేశారు. అయితే ఆయా విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైన వర్షం పడకపోవడంతో ఎండ తీవ్రతకు భూమిలో ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :