రైతుల అభిప్రాయ సేకరణ మేరకే రైతుభరోసా విధివిధానాలను రూపొందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా కుంటాల రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ పాల్గొని రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధిక సంఖ్యలో రైతులు 10 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా కల్పించాలని సూచించారు. అర్హులైన వారికే పథకం వర్తింపజేయాలని రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు.