దొంగ పెళ్లిళ్లు చేసుకుని నగలు, నగదుతో పరారైన నిత్య పెళ్లి కూతురిని మే 6న యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ముజఫర్నగర్ జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు రిపోర్ట్ లు చూసి షాక్ అయ్యారు. అయితే ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ఆమెను గతంలో పెండ్లి చేసుకున్న పెండ్లి కొడుకుల కోసం వేట ప్రారంభించారు.