ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్దారులకు రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచారు. పెంచిన పెన్షన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. జూలై 1న ఒక్కో పెన్షన్దారుడు రూ.7వేలు పొందే అవకాశం ఉంది. అనంతరం ప్రతి నెలా రూ.4వేలు పెన్షన్ అందుకోనున్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికెళ్లి పంపిణీ చేస్తారు.