రాంపూర్ గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

66చూసినవారు
రాంపూర్ గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మందడి నారాయణరెడ్డి గ్రామపంచాయతీ వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు జాతీయ జెండాని ఎగురవేశారు. అనంతరం స్కూల్ పిల్లలు సాంస్కృత కార్యక్రమాలతో అందరిని అలరించారు. అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన పిల్లలకు బహుమతులను పంపిణీ చేశారు.