May 03, 2024, 00:05 IST/బోధన్
బోధన్
అరవింద్ గెలుపుకు ప్రతి ఒక్కరు సహకరించాలి
May 03, 2024, 00:05 IST
ధర్మపురి అరవింద్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం రెంజల్ కేంద్రంతో పాటు నీల గ్రామంలో ఆయన ప్రచారం చేశారు. మూడోసారి మోడీ ప్రధాని కావాలంటే అందరం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఆయన సూచించారు. దేశ ప్రగతి బిజెపితోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.