ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా పౌరులకు మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది మరణించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అమెరికా, బ్రిటన్.. వివరణ కోరాయి. ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వివరణ ఇచ్చారు. దీన్ని ఘోర తప్పిదంగా అంగీకరించిన ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్వతంత్ర దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు.