తీహార్ జైలులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. పాపులర్ అయ్యేందుకు కొన్ని గ్యాంగులు ఆయనను హత్య చేయొచ్చనే సమాచారం అందింది. ప్రస్తుతం కేజ్రీవాల్ జైల్ నంబర్ 2లో ఉంటున్నారు. ఇక్కడ 2021లో శ్రీకాంత్ రామస్వామి అనే నిందితుడు హత్యకు గురయ్యాడు. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి సైతం కేజ్రీవాల్కు బెదిరింపులు వచ్చాయి. దీంతో కేజ్రీవాల్కి భద్రతను పటిష్టం చేశారు.