నాటి ప్రధాని ఇందిరాగాంధీ కచ్ఛాతీవును శ్రీలంకకు అప్పగించి దేశానికి ద్రోహం చేశారంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలను జై శంకర్ సమర్థించారు. దాంతో ఎక్స్ వేదికగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కౌంటర్ ఇచ్చారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదా..? తమిళనాడులో ఇతర పార్టీలతో బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు జరగలేదా..?’ అని చిదంబరం ప్రశ్నించారు.