గర్భిణీకి పురిటి నొప్పులు.. డోలీలో 5 కి.మీ. మోసుకెళ్లారు (వీడియో)

73చూసినవారు
AP: అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో గర్భిణీని డోలీలో 6 కిలో మీటర్లు మోసుకెళ్లిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. రోలుగుంట మండలం పితృగడ్డ కొండ శిఖరంలో కొర్ర దేవి అనే గర్భిణీకి బుధవారం రాత్రి 12 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో భర్త కొర్ర రమేష్ కుటుంబ సభ్యుల సహకారంతో డోలీలో కొర్ర దేవిని 6 కి.మీ. మోసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఆటోలో బుచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు.

సంబంధిత పోస్ట్