పతంజలికి సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయలు

74చూసినవారు
పతంజలికి సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయలు
ప్రముఖ వ్యాపార సంస్థ పతంజలిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే ప్రకటనల సైజులోనే క్షమాపణల ప్రకటన ఇచ్చారా? అని ప్రశ్నించింది. ఉత్పత్తుల యాడ్‌లు పెద్దవిగా కనిపిస్తుంటే, క్షమాపణలవి మాత్రం చిన్నవిగా ఎందుకు ఉన్నాయని అభ్యంతరం తెలిపింది. ఇక తాజాగా విచారణలో భాగంగా పతంజలి ఆయుర్వేదం రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణలపై ధిక్కార కేసును ఏప్రిల్ 30కు కోర్టు వాయిదా వేసింది.