సికింద్రాబాద్ లో విగ్రహ ధ్వంసంపై స్పందించిన పవన్

69చూసినవారు
సికింద్రాబాద్ లో విగ్రహ ధ్వంసంపై స్పందించిన పవన్
సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఆందోళన కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది దుర్మార్గమని, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతం వారైనా సామూహికంగా కాపాడుకోవాలన్నారు. గత ఐదేళ్లలో ఏపీలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వాటిని నిలువరించేందుకు కఠిన చర్యలు అవసరమని X వేదికగా స్పందించారు.