‘బీజేపీకి ప్రజలే గుణపాఠం చెప్పారు’

55చూసినవారు
‘బీజేపీకి ప్రజలే గుణపాఠం చెప్పారు’
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌కు నిధులను ఆపేసిందని, ఇందుకు ప్రతిగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు గెలుచుకోకుండా 240 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. టీఎంసీపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పినప్పటికీ విజయం సాధించలేకపోయారని అన్నారు. సందేశ్ ఖాలీ ఘటనపై వక్రభాష్యాలు చెప్పి బెంగాల్‌ను అప్రతిష్ట పాలు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారుజ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్