నిద్రిస్తున్న మహిళపైకి దూసుకెళ్లిన పోలీస్ కారు (వీడియో)

564చూసినవారు
ఉత్తరప్రదేశ్ బందా జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఇంటి బయట నిద్రిస్తున్న మహిళపై (55) పోలీసు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ ఘటనా స్థలిలోనే మరణించింది. ప్రమాదం జరిగిన తర్వాత, కారులో ఉన్న పోలీసు సిబ్బంది పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో మద్యం, బీరు సీసాలు పడి ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు తెలిపారు.