శ్రీరామ నవమి రోజు అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు తిలకంగా ప్రసరించాయి. మధ్యాహ్నం 12:16 గంటల సమయంలో 58 మిల్లీమీటర్ల పరిమాణంతో సూర్య కిరణాలు బాలక్ రాముడి నుదుటిని తాకాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ అపురూప దృశ్యాలను తన ట్యాబ్లో లైవ్ ద్వారా వీక్షించారు. ఈ ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు.