రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా ఈ కేసులో ఏ-6 నిందితుడిగా ఉన్న సందీప్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సందీప్ నుంచి యూరిన్, బ్లడ్ శాంపిల్స్ను పోలీసులు సేకరించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆ శాంపిల్స్ని పంపారు. ఆ రిపోర్టుల్లో పాజిటివ్ వస్తే సందీప్ ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆదివారం మరో నిందితురాలు లిషి సైతం విచారణకు హాజరయ్యారు.