తెలంగాణలో దసరా నుంచి ధాన్యం కొనుగోలు

69చూసినవారు
తెలంగాణలో దసరా నుంచి ధాన్యం కొనుగోలు
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా నుంచి జనవరి నెలాఖరు వరకు దాదాపు నాలుగు నెలల పాటు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీచేసింది. దీంతో దసరా నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వర్ష సూచనల్ని ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అందించేలా పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత పోస్ట్