తొలి ఐదు దశల్లో 40 సీట్లకే రాహుల్ పరిమితం: అమిత్ షా

57చూసినవారు
తొలి ఐదు దశల్లో 40 సీట్లకే రాహుల్ పరిమితం: అమిత్ షా
లోక్‌సభ ఎన్నికల తొలి 5 దశల్లో ప్రధాని మోదీ 310 సీట్లను అధిగమించారని, అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 40 సీట్లకే పరిమితమయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మిగతా రెండు దశల ఎన్నికల తర్వాత బీజేపీ 400 సీట్లు దాటడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజలు దాని కోసమే పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. కానీ రాహుల్ 40 సీట్లు కూడా గెలవలేరు అని తెలిపారు.