దేశంలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు కరువుతో వివిధ రాష్ట్రాలు అల్లాడిపోయాయి. ఇలాంటి సమయంలో ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వాతావరణ కేంద్రం శుభవార్త అందించింది. ఈ ఏడాది వర్షపాతం ప్రతి ఏడాది ఉన్న సగటు కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. జూలై నుండి సెప్టెంబరు వరకు వర్షపాతం గతంలో కన్నా ఎక్కువగా నమోదు కానున్నట్లు పేర్కొంది.