రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య

75చూసినవారు
రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు (88) అసలు పేరు చెరుకూరి రామయ్య. రామోజీరావు ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా 'ఈనాడు' మారింది. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులకు పునాది వేశారు.