చేవెళ్ల గడ్డపై కాషాయం జెండా ఎగురవేస్తాం: రాచూరి రాజశేఖర్

1075చూసినవారు
చేవెళ్ల గడ్డపై కాషాయం జెండా ఎగురవేస్తాం: రాచూరి రాజశేఖర్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తే చేవెళ్ల గడ్డపై కాషాయం జెండా ఎగరడం తథ్యమని శాస్త్రిపురం డివిజన్ బీజేపీ ఇంచార్జ్ రాచూరి రాజశేఖర్ అన్నారు. రాజేంద్రనగర్ శాస్త్రిపురం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నిఖిల్ ఆద్వర్యంలో బుధవారం డివిజన్ కార్యకర్తల సమావేశం జరిగింది. డివిజన్ లోని బూత్ లలో కమిటీలు వేసి ప్రతి గడపకు వెళ్లి దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలను వివరించాలన్నారు.

ట్యాగ్స్ :