హీట్ వేవ్ నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఎండలకు తోడు తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయి. దాంతో జనం బయటకు రావాలంటే వణికిపోతున్నారు. మంగళవారం ఒక్కరోజే పది మంది వరకు వడదెబ్బ బారిన పడ్డారు. మరోవైపు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దిగువకు వచ్చేదాకా కూలీలకు మధ్యాహ్నం 3 వరకు విరామం ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు.