నీటి అవస్థలతో ఇబ్బందులు పడుతున్న బెంగళూరు వాసులు

75చూసినవారు
నీటి అవస్థలతో ఇబ్బందులు పడుతున్న బెంగళూరు వాసులు
బెంగళూరులో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో బోర్లు ఎండిపోయాయి. మరోవైపు.. బెంగళూరు నగరానికి నీటిని అందించే రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో నీటి సంక్షోభం తలెత్తింది. దీంతో నగర వాసులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతుండటంతో.. ట్యాంకర్ల యజమానులు రేట్లను భారీగా పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే నీటి కొరత కారణంగా కాళ్లకృత్యాలు కూడా తీర్చుకోలేని దుస్థితి తలెత్తింది.