కరాచీ పౌరులకు జర్మనీ ఎంబసీ మూసివేత

52చూసినవారు
కరాచీ పౌరులకు జర్మనీ ఎంబసీ మూసివేత
పాకిస్థాన్‌లోని కరాచీలో జర్మనీ రాయబార కార్యాలయం అక్కడి పౌరులకు సేవల్ని నిలిపేసింది. కేవలం ఐరోపా సమాఖ్య(ఈయూ) పౌరులకు మాత్రమే ఇకపై సేవలందించనున్నట్లు ప్రకటించింది. భద్రతాకారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గడచిన కొన్ని రోజులుగా కరాచీవ్యాప్తంగా విదేశీయులు, పోలీసు అధికారులపై ఉగ్రదాడులు తీవ్రంగా పెరిగాయి. ఈక్రమంలోనే జర్మనీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :