ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా కీలక ప్లేయర్ రిషభ్ పంత్ రేపటి మ్యాచ్ కు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. రిషభ్ పంత్ వైరల్ ఫీవర్తో బాధపడుతూ ప్రాక్టీస్కు దూరంగా ఉన్నట్లు మ్యాచ్కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించారు.