పెరుగుతున్న కూరగాయల ధరలు.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం

54చూసినవారు
పెరుగుతున్న కూరగాయల ధరలు.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం
దేశంలో గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. టమోటా, ఉల్లి, బంగాళదుంప వంటి నిత్యావసర కూరగాయల రిటైల్ ధరలు 15 శాతం నుంచి 58 శాతానికి పెరిగాయి. దానికి కారణం వర్షం ప్రభావం.. ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న రోజుల్లో ధరలను అదుపు చేస్తామని కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్