హైవేపై రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు

56చూసినవారు
హైవేపై రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు
బెంగళూరు-హైదరాబాద్‌ NH44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి HYD వెళ్తున్న ట్రావెల్‌ బస్సు, MBNR జిల్లా కొత్తకోటకు వెళ్తున్న ఐచర్‌ వాహనం శనివారం అర్ధరాత్రి దాటాక గార్లదిన్నె మండలం కలగాసపల్లి వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో బస్సు క్లీనర్, ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. గాయపడిన వారు మహబూబ్‌నగర్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్