టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అమెరికా నుంచి తిరిగి స్వదేశంలో అడుగుపెట్టాడు. తాజాగా భార్య రితిక సజ్దే, కుమార్తె సమైరా శర్మతో కలిసి ముంబైకి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీలంకతో వన్డే సిరీస్ నేపథ్యంలో అమెరికాను వీడి భారత్లో చేరుకున్నాడు. కాగా, రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే.