రోడ్డుపై రచ్చచేసిన యువతులకు రూ.33 వేల ఫైన్

165461చూసినవారు
హోలీ సందర్భంగా నడి రోడ్డుపై బైకుపై రచ్చ చేసిన యువతులకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక యువకుడు స్కూటర్‌ నడుపుతుండగా వెనుక ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చొని రంగులు పూసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నోయిడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ వీడియోలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురికీ రూ.33 వేలు జరిమానా విధించారు.