సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని నల్లంపల్లి గ్రామ శివారు మొటికే ఆనంద్ పొలంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనదని స్థానిక ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. 50- 60 వయసు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతుడికి వైట్ కలర్ షర్టు, ధోతి, బట్టతల, వైట్ కలర్ గడ్డం ఉన్నదని ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదు అయి ఉంటే లేదా ఎవరైనా గుర్తు పడితే 8712656770 ఈ నెంబర్ కు సంప్రదించగలరు అని తెలిపారు.