మోదీ మంత్రివర్గంలో తొలిసారిగా బండి సంజయ్కు అవకాశం దక్కింది. ఏబీవీపీ కరీంనగర్ పట్టణ కన్వీనర్గా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బండి సంజయ్ కొనసాగారు. తరువాత వివిధ హోదాల్లో పనిచేసి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. 2019లో తొలిసారిగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ.. లోక్సభ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు.