హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండల పరిధిలోని మోయతుమ్మెద వాగు వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న తంగళ్లపల్లి గ్రామానికి చెందిన నలుగురుపై శుక్రవారం కేసు నమోదు చేసి 4 ట్రాక్టర్ల ను సీజ్ చేసినట్లు సిఐ ఎర్రల కిరణ్ తెలిపారు. ఎవరైతే అక్రమ రవాణాకు పాల్పడుతారో వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసి చట్ట ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.