

హుస్నాబాద్: రామవరం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ పథకము ప్రారంభం
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని రామవరం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి హాజరై మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు జంగంపల్లి ఐలయ్య మాట్లాడుతూ గతంలో దొడ్డు బియ్యం ఇస్తే, ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకి అమ్మడం, చౌక ధరల దుకాణాలకే వాపసు ఇవ్వడం జరిగేదని అన్నారు.