పాఠశాల అభివృద్ధికి 5వేల కోట్లు కేటాయించాలి: ఎంపీ

50చూసినవారు
రాష్ట్రంలో పాఠశాల అభివృద్ధికి 5వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి లోని ఎస్ ఎస్ గార్డెన్ లో గురువందన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, సంస్కృతి, సాంప్రదాయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సంఘం రాష్ట్ర కోశాధికారి భాస్కర్, జిల్లా అధ్యక్షులు దత్తాత్రి పాల్గొన్నారు.