TG: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి నాలుగు మృతదేహాలను గుర్తించి సహాయక బృందాలు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. టన్నెల్లో మరోచోట ఏడు మీటర్ల లోతులో మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. మిగిలిన నాలుగు మృతదేహాలు తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ బృందాలు చెబుతున్నాయి. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్లు ఇప్పటికే సిద్ధంగా చేశారు.