దక్షిణాఫ్రికాలో నిర్వహించే ఎస్ఏ20 లీగ్ మూడో సీజన్ తేదీలు వెల్లడయ్యాయి. 2025 జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన రెండు సీజన్లలోనూ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్గా నిలిచింది. ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ ఈ జట్టుకు కూడా యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి.