దేశ ప్రజలకు భారత వాతవరణ శాఖ(IMD) శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ దీవులను తాకినట్లు వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్, మాల్దీవులు, కొమోరిన్లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. ఈ నెల 31కి కేరళ తీరాన్ని, జూన్ మొదటివారంలో రాయలసీమను తాకనున్నట్లు అంచనా వేసింది. కాగా, ప్రతి ఏటా మే 18-20 మధ్య అండమాన్ను నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయి.