రేపటి వరకు శ్రీవారి మెట్టు నడక మార్గం బంద్

52చూసినవారు
రేపటి వరకు శ్రీవారి మెట్టు నడక మార్గం బంద్
తిరుమలలో భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు కూడా మూసివేయనున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భక్తులు ఇబ్బందులు పడకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్