దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలను నమోదు చేశాయి. మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల కలిపి లాభం రూ.1.4 లక్షల కోట్లు దాటింది. మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకులు నికర లాభం అంతకుముందు ఏడాది రూ.1,04,649 కోట్లు లాభాన్ని ఆర్జించగా.. 35 శాతం వృద్ధితో రూ.1,41,203 కోట్ల నికర లాభం నమోదైంది. ఇందులో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వాటానే 40 శాతం ఉంది.