సాధారణంగా మన దేశంలో గుడిలో విగ్రహాల్ని, జంతువులను పూజిస్తుంటారు. కానీ రాజస్థాన్లోని జోధపూర్లో రాయల్ ఎన్ఫీల్డ్ బండిని భక్తులు పూజిస్తున్నారు. ఆ బండికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. ఇలా చేస్తే, రోడ్డు ప్రమాదాలు జరగవని గ్రామస్థుల నమ్మకం. దీనికి గల చరిత్ర ఏంటంటే ఈ బైక్ నడిపిన బన్నా ఈ గుడి ప్రాంతంలో ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు పలుమార్లు బైక్ని స్టేషన్కి తీసుకెళ్లినా తెల్లారేసరికి ఆ బైక్ అదే చోటులో కనిపించేదట.