ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఆయన బెయిల్ పై సుప్రీంకోర్టు షరతులు విధించి, తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణ గురువారం లేదా వచ్చే వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.